మే 17 సాయంత్రం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. మ్యాచ్ రోజున 75% వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల కారణంగా ఐపీఎల్ టోర్నీ వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా టోర్నీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మే 17 నుండి ఐపీఎల్ పునఃప్రారంభం అవుతోంది.