IPL 2021 మెగా వేలం వాయిదా... ఈసారికి మినీ వేలంతోనే... బీసీసీఐ ఆలోచన మారిందా?
First Published Dec 23, 2020, 11:38 AM ISTఐపీఎల్ 2020 సీజన్ సూపర్ డూపర్ హిట్టైన తర్వాత 2021 సీజన్లో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది సమ్మర్లో జరిగే ఐపీఎల్లో అదనంగా రెండు జట్లు చేర్చాలని, వీటికోసం త్వరలో మెగా వేలం నిర్వహించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. అయితే ఈసారికి ఈ ప్రయోగాలకు ‘కామా’ పెట్టాలని భావిస్తోందట భారత క్రికెట్ బోర్డు.