బీసీసీఐ ఈ వేదికను మార్చడానికి కారణమున్నది. ఐపీఎల్ కు ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నందున దీని పరిధిని విశ్వవ్యాప్తం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీడియా హక్కుల వేలంలో రూ. 48 వేల కోట్లను దక్కించుకుని విలువపరంగా రెండో అతిపెద్ద స్పోర్ట్స్ లీగ్ గా గుర్తింపు పొందింది. ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి, బ్రాడ్కాస్టర్లకు లాభాల పంట పండిస్తున్న ఐపీఎల్ పరిధిని పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.