IPL 2020 సీజన్లో ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆరడజనుకి పైగా క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్కి మధ్యలోనే దూరమయ్యారు. భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, ఇషాంత్ శర్మ వంటి వాళ్లు గాయపడి ఐపీఎల్కు ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్కి కూడా దూరమయ్యారు. అయితే రోహిత్ శర్మను కూడా ఆసీస్ సిరీస్కి ఎంపిక చేయకపోవడంతో వివాదం రేగింది.