స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు సారథి బాబర్ ఆజమ్ పై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ను కోహ్లీతో పోల్చడం తెలివితక్కువ పని అని.. అతడికి అంత సీన్ లేదని కనేరియా విమర్శించాడు. టీమిండియాలో రోహిత్, కోహ్లీలు దిగ్గజాలు అని, వారితో బాబర్ ను పోల్చి వాళ్ల స్థాయిని తగ్గించొద్దని సూచించాడు.