2021 మార్చిలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ 4 టెస్టుల్లో 32 వికెట్లు తీస్తే, 3 టెస్టులు ఆడిన అక్షర్ పటేల్, 27 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. 3 టెస్టుల్లో 4 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అక్షర్ పటేల్, అహ్మదాబాద్లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 11 వికెట్లు తీశాడు...