నువ్వు, ధోనీ ఆ రోజు మాట్లాడుకున్న మాటలే నిజమయ్యాయి... విరాట్ టెస్టు కెప్టెన్సీ వీడ్కోలుపై అనుష్క...

First Published Jan 16, 2022, 3:56 PM IST

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కి గురైంది. టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్, సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విరాట్ సతీమణి అనుష్క శర్మ, కోహ్లీ నిర్ణయంపై స్పందించింది...

‘2014లో ఎమ్మెస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నట్టు నువ్వు చెప్పిన రోజు, నాకు ఇప్పటికీ గుర్తింది. ఆ రోజు ఎమ్మెస్ ధోనీ, నువ్వు, నేను కలిసి కాసేపు మాట్లాడుకున్నాం...

నీ గడ్డం త్వరలోనే రంగు మారుతుందని ఎమ్మెస్ ధోనీ జోక్ చేశాడు. అప్పుడు అందరూ నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నీ గడ్డం రంగు మారడం నేను గమనిస్తూనే ఉన్నాను...

.
నీలో చాలా మార్పు చూశాను. ఊహించనంత వృద్ధి చూశాను. నీ చుట్టూ, నీలో కూడా మార్పు వచ్చింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నువ్వు సాధించినదానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను...

నీ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. నీలో వచ్చిన మార్పులకు కూడా నేనె ఎంతగానో గర్విస్తున్నా... 

2014లో మనం చాలా చిన్నపిల్లలం, అమాయకులం. ప్రతిదీ మన మంచికేనని అనుకున్నాం, ప్రతిదాంట్లోనూ పాజిటివ్‌ని వెతుక్కున్నాం. కానీ ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నావు..

ఫీల్డ్‌లోనే కాదు, బయటి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావ్... ఇదే జీవితమంటే! ఊహించని చోట పరీక్షలు పెట్టడమే దానికి తెలుసు... కానీ ఎక్కడ కూడా నువ్వు తల వంచలేదు, ఓటమిని అంగీకరించలేదు...

విజయాలు వచ్చినప్పుడు నీ గెలుపు అందరికీ పంచావు, ఓటమి వచ్చినప్పుడు నీ కళ్లల్లో నీళ్లను చూశాను. జట్టు కోసం ఇంకా ఇంకా ఏమైనా చేయగలనా? అనే నీ తాపత్రాయన్ని చూసి ఆశ్చర్యపోయాను...

ఇదే నువ్వు,! ఇప్పటికీ ఎప్పటికీ ముక్కసూటి మనిషివి. అందరిలా నువ్వు నటించలేవు, అదే నీ బలం కూడా. మనసులో ఏమున్నా నీ కళ్లల్లో అది కనిపిస్తుంది...

ఓ చిన్నపిల్లాడిలా నవ్వుతావ్, కోపం గించుకుంటావ్, ఆనందంతో గంతులేస్తావ్... అందరూ నిన్ను అర్థం చేసుకోలేరు కదా... నీ లాంటి వ్యక్తి, నా జీవితంలో ఉండడం నా అదృష్టం... 

అవును... నువ్వు పర్ఫెక్ట్ కాదు, నీలోనూ కొన్ని లోపాలున్నాయి. కానీ నీ లోపాలను సరిదిద్దుకోవాలని ప్రయత్నించావా? ఎప్పుడూ మంచే చేయాలని ఎందుకు అనుకుంటావ్... 

ఎప్పడూ కష్టపడాలని ఎందుకు తపన పడతావ్? నువ్వు దురాశతో ఏ పని చేయలేదు, ఇప్పుడు ఈ పని కూడా, నాకు తెలుసు. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు...

మనం దేన్నైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే, వాళ్లు తమ పరిధిని విస్తరించుకోడానికి ప్రయత్నించరు. నువ్వు, నా ప్రేమ మాత్రం అపరిమితమైనవి... 

మన కూతురు, ఈ ఏడేళ్లల్లో నువ్వు నేర్చుకున్న ప్రతీ విషయాన్ని చూస్తుంది... నువ్వు మంచే చేశావ్...’ అంటూ సుదీర్ఘ లేఖను భర్త విరాట్ కోహ్లీ గురించి రాసుకొచ్చింది అనుష్క శర్మ...  

click me!