ఆ రనౌట్ తర్వాత కోహ్లీతో మాట్లాడా... విరాట్ నాతో అలా అన్నాడు... అజింకా రహానే కామెంట్...
First Published Dec 26, 2020, 12:27 PM ISTఆడిలైడ్లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మొదటి రెండు రోజుల్లో మంచి ఆధిపత్యం చూపించింది టీమిండియా. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసి, మంచి టచ్లో కనిపించాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించిన టీమిండియా, కోహ్లీ రనౌట్ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.