ఇదివరకే టీమిండియాకు గాయాల బెడద వేధిస్తున్నది. వెన్ను నొప్పి కారణంగా సర్జరీ చేయించుకుని జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ లు డబ్ల్యూటీసీ ఫైనల్స్ నుంచి తప్పుకోగా.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్ కూడా ఈ టోర్నీకి అందుబాటులో లేడు. ఐపీఎల్ లో ఆర్సీబీతో ఈనెల 1న జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ కెఎల్ రాహుల్ కూడా సర్జరీ బాధితుడే. జయదేవ్ ఉనద్కత్ కూడా గాయపడ్డా అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.