ఇదే విషయమై తాజాగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కొవిడ్ నెగిటివ్ వచ్చింది. దీంతో అతడు దుబాయ్ లోని భారత జట్టుతో చేరాడు. అతడి స్థానంలో తాత్కాలిక హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన వీవీఎస్ లక్ష్మణ్.. తిరిగి ఇండియాకు చేరుకున్నారు..’ అని ట్వీట్ చేసింది.