ఇక జులై - ఆగస్టులో భారత జట్టు కరేబియన్ దీవులకు వెళ్లనుంది. ఇక్కడ వెస్టిండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ సిరీస్ లో చివరి రెండు టీ20లను అమెరికాలో జరిపించేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఆగస్టులో ఐర్లాండ్ జట్టుతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.