దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 3.46 లక్షల కోవిద్ పాజిటివ్ కేసులు రాగా, 2624 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా భారత్ను రెడ్ లిస్టులో చేర్చాయి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు...
undefined
ఇండియా నుంచి వచ్చేవారికి వీసాలు జారీ చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించడంతో పాటు భారత్ నుంచి తమదేశానికి తిరిగి వచ్చే పౌరులకు 10 రోజుల క్వారంటైన్ నిబంధనను తప్పనిసరి చేశాయి...
undefined
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్... దేశంలో కరోనా కేసులు ఇంతలా పెరుగుతుంటే, ఇంకా ఐపీఎల్ ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రశ్నించాడు.
undefined
‘ఇండియాలో పెరిగిపోతున్న కోవిద్ కేసులతో యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్... ఐపీఎల్ ఇంకా కొనసాగిస్తున్నారు... ఇలాంటి సమయంలో ఐపీఎల్ కొనసాగించడం సరైన చర్యేనా...
undefined
లేక ప్రతీరాత్రి కరోనా కేసులతో భయబ్రాంతులకు గురి అవుతున్న జనాలకు ఓ రిలీఫ్లా ఐపీఎల్ను కొనసాగిస్తున్నారా? మీ ఆలోచన ఏదైనా కానీ... ఇండియా ఈ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు ఆడమ్ గిల్క్రిస్ట్.
undefined
సెకండ్ వేవ్ కరోనా కేసుల కారణంగా మరోసారి థియేటర్లకు మూతలు పడడం, నైట్ లాక్డౌన్ కూడా విధించడంతో ఇళ్లల్లో పరిమితమైన జనాలకు ఐపీఎల్ మంచి కాలక్షేపం అందిస్తోంది...
undefined
అప్పటిదాకా నిత్యం కరోనా కేసులు, కోవిద్ మృతుల లెక్కలతో విసిగి, వేసారిన భారతీయులకు ఐపీఎల్ 2020 కావాల్సిన రిలీఫ్ను అందించిన విషయం తెలిసిందే.
undefined