డిసెంబర్ 19, 2016న ఇంగ్లాండ్తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 759 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 477 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొయిన్ ఆలీ 146 పరుగులు చేయగా, జో రూట్ 88, లియామ్ డాసన్ 66, అదిల్ రషీద్ 60 పరుగులు చేశారు...