Image credit: PTI
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పుడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్ ప్లేయర్లను ఫ్రాంఛైజీలు, డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేశాయి..
అయితే కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ 2007 టోర్నీ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, వేలంలో పాల్గొన్నాడు. ధోనీని కొనుగోలు చేయడానికి 8 ఫ్రాంఛైజీలు కూడా ముందుకొచ్చాయి. ఓ ప్లేయర్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడడం అదే తొలిసారి, ఆఖరిసారి కూడా...
Image credit: PTI
ఐపీఎల్ 2008 వేలంలో రూ.9 కోట్ల 50 లక్షలకు మహేంద్ర సింగ్ ధోనీని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. రూ.9.8 కోట్లకు ఆండ్రూ ఫ్లింటాఫ్ని కొనుగోలు చేసినా ధోనీకే కెప్టెన్సీ దక్కింది..
13 సీజన్లుగా (బ్యాన్ పడిన రెండేళ్లు మినహా ఇస్తే) ఓ ఫ్రాంఛైజీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఏకైక ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీయే. 2008 నుంచి 2022 వరకూ కెప్టెన్ని మార్చే విషయంలో ఆలోచన కూడా చేయలేదు సీఎస్కే...
Dhoni CSK
ప్రస్తుతం ఐపీఎల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంఛైజీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందు వరుసలో ఉంటుంది. సీఎస్కేకి అంతటి క్రేజ్ రావడానికి ఏకైక కారణం ఆ టీమ్లో ధోనీ ఉండడమే...
2008 నుంచి 2020 వరకూ ఆడిన ప్రతీ సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ని నాకౌట్ స్టేజీకి తీసుకెళ్లాడు ధోనీ. 13 సీజన్లలో 11 సార్లు ప్లేఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, 9 సార్లు ఫైనల్ ఆడి 4 సార్లు టైటిల్ గెలిచింది..
ధోనీకి ఐపీఎల్ 2023 సీజన్ ఆఖరిది. ఇప్పటికే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ విషయాన్ని ఖరారు చేసింది. ధోనీ ‘ఫేర్వెల్ సీజన్’ అంటూ ఐపీఎల్ 2023 సీజన్కి ప్రచారం కల్పిస్తోంది...
అయితే హైదరాబాద్లో ఉన్న ధోనీ ఫ్యాన్స్కి మాత్రం నిరాశ ఎదురుకానుంది. ఐపీఎల్ 2023 సీజన్లో హైదరాబాద్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడడం లేదు చెన్నై సూపర్ కింగ్స్..
హైదరాబాద్, చెన్నై రెండూ వేర్వేరు సెట్లలో ఉండడంతో ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 21న చెన్నైలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది...
దీంతో ఆఖరి సీజన్లో ధోనీ బ్యాటింగ్ చూడాలంటే హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్, చెన్నైకి వెళ్లాల్సిందే. లేదా టీవీల్లో చూసి ఆనందించాల్సి ఉంటుంది..