Syed Mushtaq Ali Trophy: టీమిండియా జట్టు నుంచి ఔట్ అయిన అజింక్య రహానే దేశవాళీ క్రికెట్లో బౌలర్లపై సునామీల విరుచుకుపడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకదాని తర్వాత ఒకటి తుఫాను ఇన్నింగ్స్లు ఆడుతూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.
విదర్భ, ఆంధ్ర జట్ల పై అద్భుత ఇన్నింగ్స్ లను ఆడిన రహానే బరోడాపై కూడా తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దురదృష్టవశాత్తు అతను కేవలం 2 పరుగుల తేడాతో సెంచరీని మిస్ అయ్యాడు. రహానే వరుసగా 3 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లు ఆడాడు. మూడు సార్లు సెంచరీలను కొన్ని పరుగులతో కోల్పోయాడు.