కరోనా రోగుల శాడిజం... నగ్నంగా తిరుగుతూ, నర్సులకు వేధింపులు

First Published Apr 3, 2020, 11:40 AM IST

ఢిల్లీలోని నిజాముద్దీన్ గత నెలలో నిర్వహించిన మర్కజ్ సమావేశానికి హాజరై కరోనా వైరస్ లక్షణాలతో ఐసోలేషన్‌లో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నీచంగా ప్రవర్తిస్తున్నారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. దేశంలోనూ కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా సోకిన వారందరినీ ఐసోలేషన్ లో ఉంచి వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి మరీ వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే.. దానిని అర్లం చేసుకోకుండా కొందరు కరోనా రోగులు వికృత చర్యలకు పాల్పడుతున్నారు.
undefined
నగ్నంగా ఐసోలేషన్ వార్డుల్లో తిరుగుతూ.. చికిత్స అందించే నర్సులను లైంగికంగా వేధిస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ఢిల్లీలోని నిజాముద్దీన్ గత నెలలో నిర్వహించిన మర్కజ్ సమావేశానికి హాజరై కరోనా వైరస్ లక్షణాలతో ఐసోలేషన్‌లో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నీచంగా ప్రవర్తిస్తున్నారు.
undefined
తమకు కరోనా సోకిందన్న బాధ లేకుండా వైద్యసేవలు అందించే నర్సులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
undefined
దీంతో వారిపై కేసులు నమోదు చేశామని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ తెలిపారు. తమ ఆస్పత్రిలోని మహిళా నర్సులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
undefined
ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన తమకు సమాచారమిచ్చారని ఘజియాబాద్ ఎస్పీ తెలిపారు.
undefined
తమకు సిగరెట్లు, బీడీలు కావాలని ఆరుగురు రోగులు డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
undefined
లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
undefined
click me!