కరోనా పరీక్షలు... డాక్టర్లను చితకబాది..

First Published Apr 2, 2020, 11:51 AM IST

 కోవిడ్‌-19 పాజిటివ్‌ రోగితో పరిచయం ఏర్పడిందని ఓ వృద్దురాలు చెప్పడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు. 
 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది.లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా రోజూ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యం లో వైద్యులు వీధి వీధులకు తిరుగుతూ.. తమ ప్రాణాలకు తెగించి... ప్రజలకు కాపాడేందుకు ముందుకు వచ్చారు.
undefined
ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తూ.. ఎవరికైనా కరోనా సోకిందేమో గుర్తిస్తున్నారు. అలాంటి వైద్యులపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా డాక్టర్లు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
కోవిడ్‌-19 పాజిటివ్‌ రోగితో పరిచయం ఏర్పడిందని ఓ వృద్దురాలు చెప్పడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడానికి వైద్య సిబ్బంది ఇండోర్‌ నగరానికి వెళ్లారు.
undefined
ఈక్రమంలో తత్పట్టి బఖల్ ప్రాంతానికి చెందిన స్థానికులు వైద్య సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
undefined
కాగా ఇండోర్‌ నగరంలో కొత్తగా 19 కరోనా కేసులు నమోదవ్వడంతోపాటు.. బుధవారం 65 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా పేర్కొన్నారు. అలాగే నగరంలో దాదాపు 600 మందిని క్వారంటైన్‌కి తరలించామని ఆయన తెలిపారు.
undefined
దీంతో ఇప్పటి వరకు ఇండోర్‌లో నమోదైన కేసుల సంఖ్య 75కు చేరింది. మరోవైపు రాష్టంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 98కి చేరింది.
undefined
ఇండోర్‌లో పెరుగుతున్న కరోనావైరస్ కేసులను దృష్టిలో పెట్టుకొని, కలెక్టర్ మనీష్ సింగ్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులను రెడ్‌, ఎల్లో, గ్రీన్‌గా మూడు విభాగాలుగా విభజించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి.
undefined
కాగా.. ఇప్పటి వరకు భారత్ లో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
undefined
click me!