జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రిధర్ వెంబు ఓ కీలక హెచ్చరిక చేశారు. సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్న వారు పెద్ద జీతాలు పొందుతున్నారని చెప్పినా, అది ఎప్పటికీ కొనసాగుతుందనుకోవద్దని ఆయన సూచించారు.
"మెకానికల్, సివిల్ ఇంజినీర్లు లేదా టీచర్లు అందుకునే జీతాలతో పోల్చితే, టెకీ జీతాలు అసాధారణంగా ఉన్నా, వాటిని సహజ హక్కుగా భావించకూడదు," అని అన్నారు. జీతాలు ఇలాగే కొనసాగుతాయన్న నమ్మకంతో ఉండకూడదని హెచ్చరించారు.