ప్రణీత చెబుతున్న ప్రకారము స్థానికంగా ఉన్న మట్టినే పంటల కోసం వినియోగిస్తోంది. ఆ మట్టిలో వర్మీ కంపోస్టు, బయో ఫెర్టిలైజర్లను కూడా కలిపి పంటలను పండిస్తోం.ది క్యాప్సికం వంటి కూరగాయలు త్వరగానే పాడవుతాయి. కాబట్టి సాగు ప్రారంభించే ముందే ఎక్కడ మార్కెటింగ్ చేయాలో కూడా ముందుగానే డిసైడ్ అవ్వాలని చెబుతోంది ప్రణీత. ఈమె తన పంటను జైపూర్, నాసిక్, దాదర్ వంటి ప్రదేశాలలో హోల్ సేల్ వ్యాపారులకు నేరుగా అమ్ముతుంది. పంట చేతికి అందడానికి ముందే ఆర్డర్లను తీసుకుంటుంది. ప్రతి ఉదయం కొత్త రేట్లు ప్రకటిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెకి ఎలాంటి మార్కెటింగ్ సమస్య ఇంతవరకు రాలేదు.