2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O)లో పెట్టుబడి పెట్టిన వారిలో సగానికి పైగా కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారే ఉన్నారు. అంటే 92.1 శాతం మంది కొత్త వారే ఉన్నారు. నష్టాలు అంచనా వేసేందుకు ఓ లెక్క కోసం 10 మంది ఇండివిడ్యువల్ ట్రేడర్స్ లో 9 మంది నష్టాలు చవిచూశారని సెబీ నివేదిక చెబుతోంది. అంటే ఒక్కో ట్రేడర్ సుమారుగా రూ.1.2 లక్షలు నష్టపోయారు. అయితే గత ఏడాది ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంది. గత ఏడాది రూ.1.43 లక్షలు ఒక్కో ఇండియన్ ట్రేడర్ నష్టపోయారు.
ట్రేడింగ్ లో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు. వీరిలో కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతే ఎక్కువ మంది నష్టపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలివి తేటలు, నాలెజ్డ్ పెంచుకోకుండా షేర్ మార్కెట్ లోకి దిగడం చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. భారీ పెట్టుబడులు కూడా పెట్టవద్దని, తక్కువ ఇన్వెస్ట్ చేసి అవగాహన పెంచుకొని తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెట్టేలా ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.