అయితే బ్యాంకులు సాధారణంగా 3 నెలల వరకు తమ కస్టమర్లను ఇబ్బంది పెట్టకుండా నోటీసులు పంపి హెచ్చరిస్తాయి. 3 నెలలు దాటితే లీగల్ యాక్షన్స్ కి సిద్ధమవుతాయి.
ఒక నెల హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించకపోతే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. తర్వాత ఈఎంఐతో కలిపి కట్టొచ్చు. అయితే అదనపు ఛార్జీలతో కలిపి కట్టాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ ఛార్జీలు విధించే అవకాశాలు కూడా ఉంటాయి.
రెండు నెలల పాటు మీరు ఈఎంఐలు కట్టకపోతే మీ రిజిస్టర్ మొబైల్ కి బ్యాంకు నుంచి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఒక్కోసారి నోటీసులు కూడా రావొచ్చు. రెండు నెలల ఈఎంఐలు, అదనపు ఛార్జీలు కలిపి కట్టండని నోటీసులో బ్యాంకు కోరుతుంది.