యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ, “సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను వినియోగదారులకు అందించేందుకు ఈ కొత్త భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైంది. ఈ స్మార్ట్వాచ్ వినియోగదారుల బార్డర్లెస్ లావాదేవీలకు దోహదపడుతుంది,” అని చెప్పారు.
బోట్ సహ వ్యవస్థాపకుడు సమీర్ మెహతా మాట్లాడుతూ, “టెక్నాలజీని ప్రతిరోజూ వినియోగదారుల జీవితాల్లో భాగం చేయడమే మా లక్ష్యం. చక్కని డిజైన్తో పాటు సురక్షిత చెల్లింపులకు సపోర్ట్గా వేవ్ ఫార్చూన్ నిలుస్తుంది,” అన్నారు.
మాస్టర్కార్డ్ దక్షిణాసియా అధ్యక్షుడు గౌతమ్ అగర్వాల్ మాట్లాడుతూ, “పేమెంట్స్ భవిష్యత్తులో పూర్తిగా వేరబుల్స్ ఆధారంగా మారతాయి. వీటివల్ల చెల్లింపులు మరింత సురక్షితంగా, వేగవంతంగా మారతాయి,” అన్నారు.