జూలై 15, 2025 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఫార్ములా ప్రకారం MAD ఇలా లెక్కిస్తారు: 100% జీఎస్టీ, 100% EMI అమౌంట్ (ఉంటే), 100% ఫీజులు / ఇతర చార్జీలు, 100% ఫైనాన్స్ చార్జీలు (వడ్డీ). ఓవర్లిమిట్ ఉన్నట్లయితే ఆ మొత్తం మిగిలిన రిటైల్ బకాయి మీద 2% ఉంటుంది. ఉదాహరణకు ఒక యూజర్ క్రెడిట్ కార్డు బకాయి రూ. 1,34,999.60గా ఉందని అనుకుంటే. అతనికి ఫైనాన్స్ చార్జీలు రూ. 11,972.18, ఫీజులు రూ. 2,700, జీఎస్టీ రూ. 2,640.99గా ఉంది.
అయితే కొత్త మినిమం అమౌంట్ డ్యూ (MAD) విధానంలో జీఎస్టీ రూ. 2,640.99, ఫీజులు రూ.2,700, ఫైనాన్స్ చార్జీలు రూ. 11,972.18, రిటైల్ బకాయి మీద 2% అంటే రూ. 2,699.99 ఇలా అన్నీ కలిపితే మొత్తం MAD రూ. 20,013.16 అవుతుంది. అదే పాత విధానంలో అయితే రూ. 17,313.17 చెల్లిస్తే సరిపోతుంది. పాత విధానంతో పోల్చితే రూ. 2699 ఎక్కువగా ఉంటుంది.