భారతదేశంలో ట్రైన్ ట్రాన్స్ పోర్ట్ చాలా ముఖ్యమైన రవాణా సాధనం. లాంగ్ టూర్ వెళ్లే వారు కచ్చితంగా రైళ్లలో వెళ్లడానికే ప్రయత్నం చేస్తారు. దీనికి కారణం రైళ్లలో కల్పించే సౌకర్యాలు. ఇంట్లో ఉండి చేసే అన్ని రకాల పనులు రైళ్లలో ప్రయాణిస్తూ చేసేయొచ్చు. నిద్ర లేనిన తర్వాత బ్రషింగ్, స్నానం, డ్రెస్ మార్పుకొనే ఫెసిలిటీస్ ట్రైన్స్ లో లభిస్తాయి.
ఇక ఫుడ్ విషయానికొస్తే టిఫెన్స్, టీ, కాఫీ, భోజనం, స్నాక్స్ ఇలా అన్ని రకాల ఫుడ్ ట్రైన్స్ లో లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే రైళ్లలో కూడా వేర్వేరు సౌకర్యాలున్న రకరకాల రైళ్లు ఉన్నాయి. లగ్జరీ రైళ్లు, అతివేగంగా నడిచే రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు, సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్, మెట్రో ఇలా రకరకాల రైళ్లు నడుస్తున్నాయి.