Vande Bharat Train: వందే భారత్ మొదటి స్లీపర్ రైలు వచ్చేస్తోంది, ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో

Published : Sep 04, 2025, 01:57 PM IST

వందే భారత్ రైలు ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పటికే కొన్ని రూట్లలో వందే భారత్ రైలు నడుస్తోంది. మొదటిసారిగా స్లీపర్ రైలును ప్రవేశపెట్టబోతున్నారు. హై స్పీడ్ లగ్జరీ, హైటెక్స్ సౌకర్యాలతో ఇది రాబోతోంది. 

PREV
15
వందే భారత్ స్లీపర్ రైలు

దీపావళికి ముందే మోడీ ప్రభుత్వం ప్రజల కోసం బహుమతులను ప్రకటిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ స్లాబులను తగ్గించి మధ్యతరగతి, పేద ప్రజలకు పెద్ద కానుకనే ఇచ్చింది. అలాగే త్వరలోనే స్లీపర్ వందే భారత రైలు రాబోతోంది. ఇప్పటికే దేశంలో కొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. అయితే అవన్నీ కూడా కూర్చొని ప్రయాణం చేసేవే. ఇంకా స్లీపర్ రైళ్ళను ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు తొలిసారి హై స్పీడ్, లగ్జరీ, హైటెక్స్ సౌకర్యాలతో తొలి వందే భారత్ స్లీపర్ రైలు రాబోతోంది. ఇదే మనదేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలుగా చెప్పుకోవాలి. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి వందే భారత్ రైలు ప్రవేశపెడుతున్నారు.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెబుతున్న ప్రకారం గత నెలలో గుజరాత్‌లోని భావ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. జూలై 25న పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో మొదటి రేక్ సిద్ధం చేశామని, ఫీల్డ్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు.

25
ఏ మార్గంలో నడుస్తుంది?

వందే భారత్ మొదటి స్లీపర్ రైలు ఏ మార్గంలో నడుస్తుందో మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎక్కువ మంది ప్రయాణికులకు దీని ద్వారా ప్రయోజనం పొందేలా చూడాలని భావిస్తున్నారు. ఇందుకోసం సుదూర ప్రాంతం నడిచే రైలుగా మార్చాలని అలాగే రద్దీగా ఉండే మార్గాల్లోనే నడపాలని భావిస్తున్నారు. అలాగే ఏ రాష్ట్రానికి ఈ స్లీపర్ రైలు చెందుతుందో కూడా ఇంకా ప్రకటించలేదు.

35
స్పెషాలిటీలు ఇవే?

వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆధునిక స్లీపర్ రైళ్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో ప్రయాణికులకు హైటెక్ సౌకర్యాలు ఉంటాయి. ప్రతి సీటుకు ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్, యుఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. పబ్లిక్ అనౌన్స్మెంట్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టం సౌకర్యాలు కూడా ఉంటాయి.

45
వేడి నీళ్ల స్నానం

వందే భారత్ రైళ్లలో ప్రతి కోచ్ లోపల డిస్ ప్లే ప్యానెల్, సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆధునికమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. దివ్యాంగులైన ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన వ్యక్తులను టాయిలెట్లను కూడా నిర్మిస్తున్నారు. ఇక ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్న వారికి హాట్ షవర్ సౌకర్యం ఉంటుంది. అంటే వేడి నీళ్లతో స్నానం చేసే అవకాశం వారికి లభిస్తుంది.

55
విమాన ప్రయాణంతో సమానంగా

వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణం దాదాపు విమాన ప్రయాణానికి సమానమైన అనుభవాన్ని ఇచ్చేలా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాలమైన బెర్తులు అన్ని సౌకర్యాలు అధిక వేగంతో త్వరగానే గమ్యస్థానానికి చేర్చడం.. ఇవన్నీ కూడా విమానానికి పోటీ ఇచ్చేవే. దాదాపు వందే భారత్ స్లీపర్ రైలు... ఫైవ్ స్టార్ హోటల్ లో కనిపించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇది ఏ రూట్ లో నడుపుతారో తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories