ఏడు జ్యోతిర్లింగాల టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీ ఈ ఏడాది నవంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది. నవంబర్ 29 వరకు సాగుతుంది. అంటే 11 రాత్రులు 12 పగళ్ళు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ట్రైన్లో మొత్తం బెర్తులు 767. ఈ ప్యాకేజీ ఖర్చు ఒక్కొక్కరికి 24,100 రూపాయలు అవుతుంది. ఇందులో కూడా స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసి ఉన్నాయి. క్లాసును బట్టి ఖర్చులు కూడా ఉంటాయి.
స్లీపర్లో వెళ్లాలనుకుంటే పెద్దలు ఒక్కొక్కరికి 24,100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పిల్లలకైతే 22,200 రూపాయలు అవుతుంది. ఇక థర్డ్ ఏసిలో ప్రయాణించాలనుకున్న పెద్దలు ఒక్కొక్కరికి 40,890 రూపయాలు చెల్లించాలి. అదే పిల్లలకైతే 39,260 రూపాయలు చెల్లించాలి. సెకండ్ ఏసీలో ప్రయాణం చేయాలనుకునే వారు 54,390 రూపాయలు చెల్లించాలి. అదే పిల్లలకైతే 52,425 రూపాయలు చెల్లించాలి.