ఫోన్ వాడకుండా, చూడకుండా ఒక్క క్షణమైనా ఉండే పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యంగా జాబ్ చేసే వాళ్లు నిరంతంర ఇంటర్నెట్ వాడాలి. ఫోన్ కాల్స్ మాట్లాడాలి. మెసేజస్, మెయిల్స్ కి రిప్లై ఇవ్వాలి. మరి ప్రయాణంలో ఇవన్నీ బంద్ చేసేయాలి. ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా అని కాల్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఆగి ఫోన్ మాట్లాడదామంటే ప్రయాణానికి టైమ్ సరిపోదు. అందుకే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఇప్పుడు బ్లూటూత్ టెక్నాలజీతో కూడా వస్తున్నాయి.
ఓలా S1 ప్రో, TVS ఐక్యూబ్, ఏథర్ 450X, బజాజ్ చేతక్, హీరో విడా V1. బ్లూటూత్ కనెక్టివిటీ, GPS నావిగేషన్, మెరుగైన పనితీరు, స్మార్ట్ టెక్ ఫీచర్లతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.