ఈ 4 రంగాల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు చాలా సేఫ్ ... మీకు ఎప్పటికైనా లాభమే : నిపుణుల సూచన

Published : Apr 08, 2025, 02:06 PM ISTUpdated : Apr 08, 2025, 02:43 PM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్స్ నిర్ణయాల తర్వాత ఆ దేశ మార్కెట్ తో సహా ప్రచంచ మార్కెట్ కుదేలయ్యింది. మదుపర్ల సంపద ఆవిరవుతోంది. ఈ క్రమంలో ఓ నాలుగు రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు సేఫ్ అని... ఎప్పటికైనా లాభాలు తెచ్చిపెడతాయని మార్కెటె నిపుణులు చెబుతున్నారు. ఆ రంగాలేమిటో తెలుసా?     

PREV
13
 ఈ 4 రంగాల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు చాలా సేఫ్ ... మీకు ఎప్పటికైనా లాభమే : నిపుణుల సూచన
Devender Singhal

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో యావత్ ప్రపంచమే ఆందోళనలో ఉంది.  అమెరికా స్టాక్ మార్కెట్స్ తో సహా చాలా దేశాల్లోని స్టాక్ మార్కెట్స్ పతనం అవుతున్నాయి. ఇలా వరల్డ్ మార్కెట్ల అస్థిరత 2008, 2020 నాటి మార్కెట్ క్రాష్‌లను గుర్తుచేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి పతనానికి హెచ్చరిక కాదు... పెట్టుబడిదారులు తిరిగి సర్దుబాటు చేసుకోవడానికి ఒక అవకాశమని ఆర్థిక, మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు దేవేందర్ సింఘాల్ మాట్లాడుతూ... చరిత్రలో మార్కెట్ పతనాలు బలమైన, నిలకడగా ఉండే ర్యాలీలకు మార్గం సుగమం చేశాయని అన్నారు. "మీరు దీర్ఘకాలిక మార్కెట్ ప్రయాణాన్ని చూస్తే అన్ని పతనాలు చివరికి గొప్ప ఎంట్రీ పాయింట్లుగా కనిపిస్తాయి. ఈసారి కూడా అంతే" అని ఆయన అన్నారు.

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ అనిశ్చితి ప్రభావం ఉన్నప్పటికీ, భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కంటే మెరుగైన స్థానంలో ఉందని సింఘాల్ పేర్కొన్నారు. ''భారతదేశంపై ఇంకా ఆశాభావం ఉంది. ఇతర మార్కెట్లలో కనిపించిన స్థాయిలో మన పతనం లేదు. రాబోయే వాణిజ్య చర్చలు భారతదేశానికి మరింత అనుకూలమైన పరిస్థితులకు దారితీస్తాయని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

వాణిజ్య నిబంధనలు మెరుగుపడితే భారతదేశం ప్రపంచ ఎగుమతి వాటాను పెంచుకుంటుందని.. ముఖ్యంగా యూఎస్ మార్కెట్‌లో మంచి స్థానం పొందుతుందన్నారు సింఘాల్. అయితే విధానపరమైన అనిశ్చితి, ప్రపంచ ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతున్నందున రాబోయే రెండు మూడు నెలలు కష్టంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

23
Devender Singhal

బ్యాంకుల కంటే ఆర్థిక సేవలు రాణించవచ్చు

వివిధ రంగాల ట్రెండ్‌ల గురించి మాట్లాడుతూ... ఆర్థిక రంగాలు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇష్టమైనవిగా కొనసాగుతున్నాయని సింఘాల్ అంగీకరించారు. అయితే నికర వడ్డీ మార్జిన్‌లపై (NIMలు) ఒత్తిడి కారణంగా బ్యాంకింగ్ స్టాక్‌లపై కొంచెం జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. “మేము బ్యాంకులపై సానుకూలంగా ఉన్నప్పటికీ, మా ప్రస్తుత వైఖరి కొంచెం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఆదాయ అవకాశాలు బలంగా కనిపిస్తున్న విభిన్న ఆర్థిక సేవలను మేము ఇష్టపడతాము” అని ఆయన అన్నారు.

దేశీయ వినియోగంపై దృష్టి పెట్టండి
 
సింఘాల్ ప్రపంచ అస్థిరత యొక్క మిశ్రమ ప్రభావాన్ని హైలైట్ చేశారు. ఫార్మా, ఆటోమొబైల్స్ వంటి రంగాలు ప్రపంచ మార్కెట్లతో బాగా అనుసంధానించబడి ఉన్నాయి, ఇవి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాయి. అయితే దేశీయంగా ఉన్న కంపెనీలు ఇటీవలి పన్ను రాయితీ చర్యలు, స్థిరమైన ద్రవ్యోల్బణం నుండి ప్రయోజనం పొందవచ్చని ఆయన అన్నారు.
 
ద్రవ్యోల్బణం: భారతదేశం vs ప్రపంచ ట్రెండ్‌లు

ప్రపంచ ద్రవ్యోల్బణం గురించి పెరుగుతున్న భయాల నేపథ్యంలో సింఘాల్ భారతదేశంలో, అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణ ట్రిగ్గర్‌ల మధ్య తేడాను చూపించారు. “భారతదేశ ద్రవ్యోల్బణం ఆహారం, శక్తికి ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం, రూపాయి స్థిరంగా ఉండటంతో భారతీయ వినియోగదారులపై అంత ప్రభావం ఉండకపోవచ్చు” అని ఆయన అన్నారు.
 

33
Stock Market

ఈ నాలుగు రంగాల్లో పెట్టుబడులు సేఫ్?

వినియోగం, ఆర్థిక రంగాలను దాటి చూస్తే సింఘాల్ బలమైన ఆదాయ అవకాశాలు కలిగిన కొన్ని రంగాలను గుర్తించారు. “ఫైనాన్సియల్, టెలికాం సేవలు, ఆరోగ్య సంరక్షణ, డొమెస్టిక్ కన్జప్షన్ అనేవి మంచి ఆదాయ వృద్ధిని కలిగి ఉండే రంగాలు. స్టాక్ మార్కెట్లు పతనమైనా ఇవి వేగంగా కోలుకుంటాయి, తక్కువ నష్టభయాన్ని కలిగి ఉంటాయి” అని మార్కెట్ విశ్లేషకుడు దేవేందర్ సింఘాల్ తెలిపారు

Read more Photos on
click me!

Recommended Stories