కొనసాగుతున్న ఉద్యోగుల బదిలీ..
విస్తారా ఇప్పటికే తన ప్రయాణికులకు విలీన ప్రక్రియ గురించి తెలియజేయడం ప్రారంభించింది. తరచూ ప్రయాణించే ప్రయాణికుల వివరాలు, వారికి అందిస్తున్న సేవల గురించి ఇప్పటికే ఎయిర్ ఇండియాకు బదిలీ చేసింది. విస్తారా ఉద్యోగులు ఎయిర్ ఇండియాలోకి బదిలీ కావడం ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. గుర్గావ్లోని ఎయిర్ ఇండియా కొత్త ప్రధాన కార్యాలయం నుండి అనేక మంది విస్తారా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ప్రయాణికుల్లో అనుమానాలు..
టిక్కెట్ల బుకింగ్లో అవాంతరాలపై ప్రయాణికుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. విలీన తేదీ తర్వాత షెడ్యూల్ చేయబడిన విమానాలలో బిజినెస్, ప్రీమియం, ఎకానమీ క్లాస్ వంటి విస్తారా ప్రీమియం క్యాబిన్లలో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా ఎలా సర్దుబాటు చేస్తుందన్న అనుమానాలున్నాయి. రెండు క్లాష్ అయ్యే అవకాశాలున్నాయని పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని విస్తారా ప్రతినిధులు చెబుతున్నారు.