మంగళవారం ముగిసిన చివరి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. మరోవైపు రోజంతా ట్రేడింగ్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 195.71 పాయింట్లు లేదా 0.36 శాతం క్షీణించి 57,064.87 వద్ద ముగియగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ 17 వేల స్థాయికి దిగువన 16,983.20 వద్ద ముగిసింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.91 వద్ద ఉంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్ డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను పొందాయి. ఎక్కువగా నష్టపోయిన వాటిలో సీప్లా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా ఉన్నాయి. ఫార్మా మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడటంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి.