పెద్ద షేర్ల గురించి మాట్లాడితే ఈ రోజు ట్రేడింగ్ తర్వాత భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్ షేర్లు గ్రీన్ మార్క్లో ముగిశాయి. మరోవైపు, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, బిపిసిఎల్ షేర్లు రెడ్ మార్క్ తో ముగిశాయి.
సెక్టోరల్ ఇండెక్స్ని పరిశీలిస్తే నేడు మీడియా మినహా అన్ని రంగాలు గ్రీన్ మార్క్లో మూగిశాయి. వీటిలో ఎఫ్ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్స్, ఐటి, పిఎస్యూ బ్యాంకులు, ఫార్మా అండ్ ఆటో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఉదయం అత్యధిక స్థాయిలో ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 127.37 పాయింట్ల (0.22 శాతం) లాభంతో 57017.13 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 39.20 పాయింట్ల (0.23 శాతం) లాభంతో 16970.20 వద్ద ప్రారంభమైంది.
నిన్న అంటే సోమవారం స్టాక్ మార్కెట్ అత్యున్నత స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 765.04 పాయింట్ల (1.36 శాతం) లాభంతో 56,889.76 వద్ద ముగియగా మరోవైపు, నిఫ్టీ 225.85 పాయింట్ల లాభంతో (1.35 శాతం) 16,931.05 వద్ద ముగిసింది.