కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ జోరు..సెన్సెక్స్‌ అల్ టైం రికార్డ్‌ బ్రేక్.. నిఫ్టీ 17వేల మార్క్‌ క్రాస్‌..

First Published Aug 31, 2021, 11:42 AM IST

గత సెషన్‌లో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ముగిసిన తరువాత ప్రపంచ మార్కెట్ల నుండి సానుకూల సూచనల మధ్య స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 127.37 పాయింట్ల లాభంతో (0.22 శాతం) 57017.13 వద్ద ప్రారంభమైంది. 

 నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 39.20 పాయింట్ల (0.23 శాతం) లాభంతో 16970.20 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో 1298 షేర్లు లాభపడ్డాయి, 521 షేర్లు క్షీణించాయి, 87 షేర్లలో ఎలాంటి  మార్పు లేదు. గత వారం 30-షేర్ల బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 795.40 పాయింట్లు  అంటే 1.43 శాతం లాభపడింది. గత సెషన్‌లో ట్రేడింగ్ సమయంలో అంటే నిన్న సెన్సెక్స్ 56958.27, నిఫ్టీ 16,951.50 రికార్డు స్థాయిని తాకింది.   

విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) క్రమంగా పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్‌లో విజృంభణకు దారితీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడింది, అలాగే ఇన్వెస్టర్లలో కరోనా భయం వాక్సిన్ కారణంగా ముగిసినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా జి‌డి‌పి, ఆటోమొబైల్ అమ్మకాల మంచి సంకేతాల అంచనాలు కూడా మార్కెట్లో పెరిగాయి. 

ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరును కనబరిచింది . నిఫ్టీ 45 శాతం రిటర్న్ ఇచ్చింది. అఅలాగే ఈ సంవత్సరం జనవరి నుండి నిఫ్టీ 19 శాతం పెరిగింది. మెక్సికన్ మార్కెట్ ఈ సంవత్సరం 18.97 శాతం రాబడిని ఇచ్చింది. తైవాన్ మార్కెట్ 15.70 శాతం, చైనా మార్కెట్ 1.94 శాతం, ఫ్రాన్స్ అండ్  కొరియా అలాగే యుఎస్ మార్కెట్లు కాస్త తక్కువ రాబడిని ఇచ్చాయి. భారతీయ స్టాక్ మార్కెట్  మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక సంవత్సరంలో రూ .75 లక్షల కోట్లు పెరిగింది. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో రూ .2.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. రిటైల్ పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. గత 20 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10.56 లక్షల కోట్లు పెరిగింది. 
 
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మాక్రో ఎకానమీ డేటా, వాహన విక్రయాల డేటా, ప్రపంచ ధోరణి ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల దిశను నిర్ణయిస్తాయి. అంతేకాకుండా పెట్టుబడిదారులు కోవిడ్ -19  వాక్సినేషన్ వేగాన్ని చూస్తారు. మార్కెట్ల దిశ కూడా రూపాయి, బ్రెంట్ ముడి చమురు ధోరణిపై ఆధారపడి ఉంటుంది.

హెవీ వెయిట్ షేర్లలో నేడు భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఇండియా యూనిలీవర్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టి‌పి‌సి, మారుతి, నెస్లే ఇండియా, ఐ‌టి‌సి షేర్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  

ప్రీ-ఓపెన్ సమయంలో  స్టాక్ మార్కెట్ ఉదయం 9.02 గంటలకు సెన్సెక్స్ 57123.28 స్థాయిలో 233.52 పాయింట్లు (0.41 శాతం) పెరిగింది. నిఫ్టీ 60.80 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 16991.80 వద్ద ఉంది.  

సెన్సెక్స్-నిఫ్టీ నిన్న అంటే సోమవారం అత్యున్నత స్థాయిలో  ముగిసింది  రోజంతా  ఒడిదుడుకుల తర్వాత అత్యధిక స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 765.04 పాయింట్ల (1.36 శాతం) లాభంతో 56,889.76 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 225.85 పాయింట్ల లాభంతో (1.35 శాతం) 16,931.05 వద్ద ముగిసింది. 

  స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో లాభాలతో  ప్రారంభమైంది. సెన్సెక్స్ 321.99 పాయింట్ల లాభంతో (0.57 శాతం) 56,446.71 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 103.30 పాయింట్ల (0.62 శాతం) లాభంతో 16,808.50 వద్ద ప్రారంభమైంది. 

click me!