నాలుగు రోజుల నిరాశకు మంగళవారం బ్రేక్
స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల పాటు తగ్గుదల కొనసాగింది. దీని తర్వాత బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్ మార్క్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. చివరి ట్రేడింగ్ రోజున సెన్సెక్స్ 198.44 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 58664.55 వద్ద ముగిసింది. దీనితో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 86.80 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగి 17503.35 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ లాభాలను పొందితే.. ఒఎన్జిసి, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్ షేర్లు భారీగా నష్టపోయాయి.. ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పడిపోయాయి, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ పేర్లలో కొనుగోలు కనిపించింది.