ఓమిక్రాన్ భయాలు.. నేడు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం..

Ashok Kumar   | Asianet News
Published : Dec 03, 2021, 05:03 PM IST

భారతదేశంలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్-19  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నిర్ధారణ కావడంతో ఆ ప్రభావం గురువారం స్టాక్ మార్కెట్‌పై కనిపించింది.  దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలింది, అలాగే ప్రారంభ లాభాలను కోల్పోయింది. 

PREV
14
ఓమిక్రాన్ భయాలు.. నేడు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం..

నేడు ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున బి‌ఎస్‌ఈ 30-షేర్ల సెన్సెక్స్ 764.83 పాయింట్లు కోల్పోయింది. అంటే 1.31 శాతం పడిపోయి 58 వేల దిగువకు చేరి 57,696.46 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా క్లిష్ట పరిస్థితిని ఎదురుకొంది. నిఫ్టీ 204.95 పాయింట్లు లేదా 1.18 శాతం కోల్పోయి 17,200 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 17,196.70 వద్ద ముగిసింది.

ప్రారంభంలో లాభాలు
సెన్సెక్స్ 30 షేర్ల బిఎస్ఇ 58,676.41 వద్ద  215,12 పాయింట్లు లేదా 0.37 శాతంతో ప్రారంభమైంది. ఆలాగే  ఎన్ఎస్ఈ నిఫ్టీ 17469,65 స్థాయిలో 68 పాయింట్లు లేదా 0.3శాతంతో ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో లార్సెన్ & ట్రూబో షేర్లు మంచి లాభాలను చవిచూశాయి. 

24

గురువారం భారీ వృద్ధి
గత ట్రేడింగ్ చివరి రోజున స్టాక్ మార్కెట్ సందడి చేసింది. సెన్సెక్స్-నిఫ్టీ రెండూ భారీ పెరుగుదలతో ముగిశాయి. 776.50 పాయింట్లు లేదా 1.35 శాతం లాభంతో బిఎస్‌ఇ సెన్సెక్స్ మళ్లీ 58 వేలు దాటి 58,461.29 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 234.75 పాయింట్లు లేదా 1.37 శాతం లాభంతో 17,401.65 వద్ద ముగిసింది. 

కరోనా కొత్త వేరియింట్​ ఒమిక్రాన్​ కేసులు దేశంలో వెలుగు చూడడంతో  పెట్టుబడుదారులను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయంగా పెరుగుతోన్న కరోనా కేసులు విదేశీ సంస్థాగత పెట్టుబడుదారులను వెనకడుగు వేసేలా చేశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. 
 

34

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద నిలిచింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పడిపోతే.. యుపీఎల్, బిపీసీఎల్, ఒఎన్‌జీసీ, ఐఓసిఎల్, ఎల్ & టి షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ మినహా ఇతర అన్ని సెక్టోరల్ సూచీలు ఎరుపురంగులో ముగిశాయి.


“వచ్చే వారం ఆర్‌బిఐ సమావేశం జరగనున్న నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు హెవీవెయిట్‌ల నష్టాల కారణంగా వచ్చిన మొత్తం లాభాలను వదులుకున్నాయి. ఇదిలా ఉంటే, భారత్ ఒమిక్రాన్ కేసులను నివేదించడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త వహిస్తున్నారు” అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.

44

 స్టాక్ మార్కెట్ పై ఒక లుక్
'కొనుగోళ్ళు' సిఫార్సు తర్వాత పేటి‌ఎం షేర్లు 3 శాతం లాభపడ్డాయి
అమల్గమేషన్ కోసం సెబీ నిబంధనలను సడలించడంతో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 5 శాతం లాభపడింది

బోనస్ షేర్ ఇష్యూ కోసం ఐ‌ఈ‌ఎక్స్ (IEX) రికార్డు తేదీ కంటే ముందే 5 శాతం పెరిగింది

దలాల్ స్ట్రీట్‌ 
 కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ కలిగించే తీవ్రమైన హానిని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుగొంటున్నప్పటికీ  వైరస్ అత్యంత అంటువ్యాధి కావచ్చని ప్రాథమిక ఆధారాలు సూచించాయి. భారతదేశంలో ఓమిక్రాన్ వేరియంట్ మొదటి కేసులు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు నిర్ధారించింది. COVID-19 'Omicron' వేరియంట్‌  వ్యాపించినట్లు అనుమానించిన 12 మంది రోగులు శుక్రవారం ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిలో చేరినట్లు నివేదికలు సూచించాయి.

click me!

Recommended Stories