లండన్‌లో గ్రాండ్ గా స్నేహితురాలీని పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్.. త్వరలోనే హనీమూన్ ట్రిప్‌ కూడా..

First Published Jun 24, 2024, 11:54 PM IST

భారత్ నుంచి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా తన చిరకాల స్నేహితురాలు జాస్మిన్‌తో   వివాహ జీవితంలోకి అడుగుపెట్టాడు. 
 

2023లో నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్ మాల్యా ఏడాది తర్వాత జాస్మిన్‌తో పెళ్లి  లైఫ్ ప్రారంభించాడు. లండన్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్‌ ద్వారా సిద్ధార్థ్ మాల్యా, జాస్మిన్ ఒక్కటయ్యారు. గత 15 రోజులుగా మాల్యా  కుటుంబంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి.

సిద్ధార్థ్ మాల్యా-జాస్మిన్ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. త్వరలో ఈ జంట హనీమూన్ ట్రిప్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. లండన్‌లో చేరిన తర్వాత సిద్ధార్థ్ మాల్యా ఆరోగ్యంతో పాటు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో జాస్మిన్, సిద్ధార్థ్ మాల్యా జీవనోపాధికి సహాయం చేసింది.

Latest Videos


2023 ప్రారంభంలో కాలిఫోర్నియాలో జరిగిన హాలోవీన్ పార్టీలో సిద్ధార్థ్ మాల్యా జాస్మిన్‌కి తన ప్రేమను తెలపగ, తరువాత  జాస్మిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు భారతదేశంలో ఉన్నప్పుడు నటి దీపికా పదుకొణెతో డేటింగ్ పెద్ద సందడి చేసింది. కానీ అదే వేగంతో ఈ సంబంధం తెగిపోయింది. విడిపోయిన తర్వాత వీరిద్దరూ పలు ఆరోపణలు కూడా చేశారు. 
 

భారతీయ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
 

click me!