Banking Rule: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయ్!

Banking Rule Changes Effective April 1st: ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి.

SBI Banking Rule Changes Effective April 1st in telugu rma

Banking Rule Changes Effective April 1st: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లో ఏప్రిల్ 1 నుంచి కొన్నిమార్పులు జరగనున్నాయి. ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఉదాహరణకు స్విగ్గీలో ఆన్‌లైన్ పేమెంట్స్, ఎయిర్ ఇండియా టిక్కెట్లు కొనడం వంటివి ఉన్నాయి.

ఈ కొత్త రూల్స్ ఏ కార్డులకు వర్తిస్తాయి? 

సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ల్లో ఈ మార్పులు ఉంటాయి. 

SBI Banking Rule Changes Effective April 1st in telugu rma
బ్యాంక్ నిబంధనలు

సింప్లీక్లిక్ ఎస్‌బీఐ కార్డ్: స్విగ్గీలో రివార్డ్ పాయింట్లు తగ్గాయి. ఈ కార్డు ఉన్నవాళ్లకు స్విగ్గీలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై 10X రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఇది 5Xకి తగ్గుతుంది. అయితే, Apollo 24X7 మొదలైన పలు వాటిలో చేసే ఆన్ లైన్ కొనుగోళ్లకు 10X రివార్డ్ పాయింట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.


ఎస్‌బీఐ కస్టమర్లు

ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్: ఎయిర్ ఇండియా టిక్కెట్లపై రివార్డ్ పాయింట్లు తగ్గాయి. ఇప్పుడు రూ.100కు 15 పాయింట్లు ఉంటే, మార్చి 31, 2025 నుంచి 5 పాయింట్లు మాత్రమే వస్తాయి. 

ఎస్‌బీఐ బ్యాంక్

ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్: ఎయిర్ ఇండియా టిక్కెట్లపై రివార్డ్ పాయింట్లు తగ్గాయి. ఇప్పుడు రూ.100కు 30 పాయింట్లు ఉంటే, మార్చి 31, 2025 నుంచి 10 పాయింట్లు మాత్రమే వస్తాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!