ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ జాబితా చేయని షేర్లు ఒక్కొక్కటి రూ .1,500 నుండి రూ .1,550 పరిధిలో ట్రేడవుతున్నాయి. అంటే ఒక్కో షేరుకు 1,500 రూపాయల చొప్పున సంస్థ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలు అని ఒక నివేదిక పేర్కొంది. కంపెనీ గత ఏడాది వాటాలు విక్రయించడం ప్రారంభించిన నేపథ్యంలో కంపెనీ వాల్యూ ఏకంగా మూడు రెట్లు పెరిగింది.
undefined
డిసెంబర్ 2019లో రిలయన్స్ రిటైల్ షేర్లు రూ .900 వద్ద ట్రేడయ్యయి. రిలయన్స్ రిటైల్ స్టేక్ హోల్డర్లకు రిలయన్స్ రిటైల్ నాలుగు షేర్లకు బదులుగా ఆర్ఐఎల్లో ఒక వాటాను ఇచ్చే పథకాన్ని కంపెనీ ప్రకటించింది. ఈ పథకం తరువాత రిలయన్స్ రిటైల్ షేర్లు ఒక్కో షేరుకు 380 రూపాయలకు పడిపోయాయి. జనవరిలో రిలయన్స్ ఈ పథకాన్ని ఆప్షనల్ చేసింది. అప్పటి నుండి జాబితా చేయని మార్కెట్లో మంచి పనితీరును కనబరిచింది.
undefined
రిలయన్స్ రిటైల్ 2020 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో నికర లాభం 88.1 శాతం వృద్ధితో 1,830 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది.మరోవైపు త్వరలోనే ఐపిఓతో రానుందని భావిస్తున్న రిలయన్స్ రిటైల్ కొత్తగా 6500-7000 అవుట్లెట్లను తెరవాలని యోచిస్తోందట.
undefined