దేశ ఆర్థికవ్యవస్థ మునిగిపోతున్నప్పుడు కూడా ముకేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?

First Published Nov 10, 2020, 3:30 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు. ఒక్క భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలో కూడా అత్యంత సంపన్నుడు కూడా. ముఖేష్ అంబానీ సంపద ప్రతి సంవత్సరానికి బిలియన్ల కొద్దీ పెరుగుతోంది. 

కరోనా వైరస్ కారణంగా దేశం, ప్రపంచం ఆర్ధికవ్యవస్థ లాక్ డౌన్ లో పడిపోయినప్పుడు కూడా ముఖేష్ అంబానీ నిమిషానికి రూ.1.5 కోట్లు సంపాదించారు.
undefined
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం దేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఈ ఏడాది లాక్ డౌన్ అయిన తర్వాత ప్రతి గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించాడు.
undefined
గంటకు 90 కోట్ల రూపాయల ఆదాయం ప్రకారం, ముఖేష్ అంబానీ సంపాదన ఒక్క నిమిషానికి రూ.1.5 కోట్లు అని చెప్పవచ్చు.
undefined
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం అంబానీ వ్యక్తిగత సంపద రూ.2,77,700 కోట్లు పెరిగి రూ.6,58,400 కోట్లకు చేరుకుంది.
undefined
ముఖేష్ అంబానీ సంపాదన, జీవనశైలి గురించి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ముకేష్ అంబానికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
undefined
ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కుటుంబంతో కలిసి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇంటిలో నివసిస్తున్నారు. ఈ 27 అంతస్తుల ఇంట్లో సామాన్యులు ఊహించని లగ్జరీ సౌకర్యాల ఉన్నాయి.
undefined
click me!