కరోనా కాలంలో ఒక్కనెల జీతం కూడా తీసుకొని ఆసియా సంపన్నుడు.. కానీ అతని సంపాదన ఎంతో తెలుసా ?

First Published Jun 3, 2021, 7:41 PM IST

దేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోలేదు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావడంతో ముకేష్ అంబానీ స్వచ్ఛందంగా తన పారితోషికాన్ని వదులుకున్నాట్లు తెలిపింది. 

తాజాగా వార్షిక నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ వేతనం జీరో అని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ కంపెనీ నుండి రూ .15 కోట్ల వేతనం పొందారు.
undefined
అంబానీ బంధువుల వేతనం జీతంముఖేష్ అంబానీ బంధువులు నిఖిల్ మెస్వానీ అండ్ హిటల్ మెస్వానీ వేతనం రూ .24 కోట్లలో ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పిఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ ల వేతనం కూడా పెరిగింది. 2020-21లో పిఎంఎస్ ప్రసాద్‌కు వేతనం రూ .11.99 కోట్లు లభించగా, అంతకుముందు సంవత్సరంలో అతని వేతనం రూ .11.15 కోట్లుగా ఉంది. అదేవిధంగా కపిల్ వేతనం రూ .4.04 కోట్ల నుంచి రూ .4.24 కోట్లకు పెరిగింది.
undefined
కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అంబానీ భార్య నీతా ప్రతి సమావేశానికి రూ .8 లక్షలు, రూ .1.65 కోట్లు కమీషన్ పొందింది. ఈ కాలంలో స్వతంత్ర డైరెక్టర్లందరికీ రూ .1.65 కోట్లు, సిట్టింగ్ ఫీజు రూ .36 లక్షలు లభించింది.
undefined
రిలయన్స్ ఉద్యోగులతో కరోనా కాలంలో రిలయన్స్ తన ఉద్యోగులతో వెన్నుదన్నుగ నిలబడిందని తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా ఉద్యోగి మరణిస్తే వచ్చే ఐదేళ్ల వేతనాన్ని రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు అందించనుంది. పేరోల్‌లో లేని ఉద్యోగి కోవిడ్ -19 కారణంగా మరణించిన కుటుంబానికి రూ .10 లక్షలు అందించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు.
undefined
మరణించిన ఉద్యోగుల పిల్లలకు భారతదేశంలోని ఏ సంస్థలోనైనా 100% ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు పుస్తక ఫీజు అందించనుంది. అలాగే రిలయన్స్ తన ఉద్యోగులు వారి కుటుంబాల టీకాల మొత్తం ఖర్చును కూడా భరిస్తుందిని తెలిపింది.
undefined
click me!