Sale: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల‌పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు.. గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది

Published : Aug 13, 2026, 08:04 PM IST

Sale: రిలయన్స్ డిజిటల్ తాజాగా డిజిట‌ల్ ఇండియా సేల్ క్రేజీ ఆఫ‌ర్స్ పేరుతో కొత్త సేల్ తీసుకొచ్చింది. ఆగ‌స్టు 16తో ముగియ‌నున్న ఈ సేల్‌లో అదిరిపోయే డీల్స్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డీల్స్

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్‌లో బడ్జెట్ నుంచి ప్రీమియం ఫోన్ల వరకు అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 4G స్మార్ట్‌ఫోన్లు రూ.10,999 నుంచి, 5G ఫోన్లు రూ.13,999 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐఫోన్లు, ఫోల్డబుల్ ఫోన్లతో పాటు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలు రూ.2 లక్షల వరకు ఉన్నాయి. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. అలాగే కొన్ని ఫోన్లకు 30 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసి కొత్త ఫోన్ కొనేవారికి ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.

25
యాక్సెసరీస్‌పై కూడా ప్రత్యేక ఆఫర్లు

స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, వేరబుల్స్, మొబైల్ యాక్సెసరీస్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. UPI ద్వారా చెల్లింపులు చేస్తే ఎంపిక చేసిన యాక్సెసరీస్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా రూ.15,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లపై ఎంపిక చేసిన బ్లూటూత్ స్పీకర్లు, ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంకులపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అంటే ఫోన్‌తో పాటు అవసరమైన యాక్సెసరీస్ కొనుగోలు చేసే వారికి అదనపు ప్రయోజనం లభిస్తుంది.

35
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు

హోమ్ అప్లయెన్సెస్ కొనుగోలు చేసేవారికి కూడా D.I.S.C.O. సేల్‌లో పలు ఆఫర్లు ఉన్నాయి. 65 అంగుళాల 4K UHD Google TVలు రూ.39,990 నుంచి అందుబాటులో ఉన్నాయి. పెద్ద స్క్రీన్ టీవీని ఇంటికి తీసుకురావాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఆఫర్. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేట‌ర్స్ రూ.39,990 నుంచి ప్రారంభమవుతున్నాయి. వీటిపై ఉచిత బహుమతులు, ఎక్స్‌చేంజ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేస్తే డైస‌న్ బిగ్ బాల్ వ్యాక్యూమ్ క్లీన‌ర్‌నురూ.43,900కి బదులుగా రూ.13,900కు పొందే అవకాశం ఉంది.

అలాగే వాష‌ర్ డ్రైయ‌ర్‌లు

రూ.55,990** నుంచి లభిస్తున్నాయి. వీటితో పాటు రూ.18,000 వరకు విలువైన ఉచిత బహుమతులు పొందే అవకాశం ఉందని రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది.

45
ల్యాప్‌టాప్‌లపై వారంటీ, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్

ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.39,999 నుంచి ప్రారంభమయ్యే ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై 1+2 సంవత్సరాల ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ అందిస్తున్నారు. అదనంగా పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.5,000 వరకు ఎక్స్‌చేంజ్ ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు కొత్త ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్లు ఉపయోగపడే అవకాశం ఉంది.

55
ఆగస్టు 16 వరకు మాత్రమే..

D.I.S.C.O. సేల్ ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై బ్యాంక్ కార్డులు, పేపర్ ఫైనాన్స్, UPI చెల్లింపుల ద్వారా రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. సేల్ సమయంలో ఒక సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లను రిలయన్స్ డిజిటల్ స్టోర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ పొందవచ్చు. దేశవ్యాప్తంగా 800కు పైగా నగరాల్లో 620కి పైగా రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, అలాగే 900కు పైగా MyJio స్టోర్లు ఉన్నాయని సంస్థ తెలిపింది. 300కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన 5,000కు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కొనుగోలు అనంతరం సేవల కోసం Reliance resQ ద్వారా సర్వీస్ సపోర్ట్ కూడా అందిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories