ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ భారీ మొత్తాన్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతనితో పాటు మరొకరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 316(5), 61(2) కింద కేసు నమోదు చేశారు. ఈ బ్యాంకులో ఈ భారీ కుంభకోణం 2020 నుంచి 2025 వరకు జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ భారీ కుంభకోణం ఎలా జరిగింది? ఈ ఘటనలో ఎవరెవరున్నారు అనేది తెలుసుకునేందుకు ‘ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్’కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.