ఈ విషయాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ త్వరలో దేశంలో ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ వ్యాప్తి చాలా తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు డిజిటల్ చెల్లింపులను అందించడం దీని ముఖ్య లక్ష్యం. అలాగే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కల సాకారం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎస్ఎంఎస్, ఐవిఆర్ఎస్ ద్వారా ఐఎంపిఎస్ సేవలను యాక్సెస్ చేయడానికి ప్రతి లావాదేవీకి పరిమితి రూ.5,000 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్ల ద్వారా పేమెంట్ అక్సెప్టెన్స్ (PA) అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బిఐ జియో-ట్యాగింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.