Ratan Tata: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు.
86 ఏళ్ల రతన్ టాటా.. ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు సోమవారం తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో టాటా పోస్ట్ చేశారు.
అయితే, బుధవారం టాటా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ముంబైలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్లో చేర్చి వైద్యమందించారు. ఈ క్రమంలో వైద్యం అందుకుంటూ బుధవారం రాత్రి రతన్ టాటా కన్నుమూశారు.