రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి.. అద్భుతమైన పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌

Published : Sep 30, 2025, 08:58 PM IST

Invest 12500 Get 40 Lakh Return: భారతీయ పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్‌లో 7.1% వడ్డీతో ₹12,500 ఇన్వెస్ట్ చేస్తే మీరు ₹40 లక్షల వరకు రాబడి పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీమ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
14
Post Office పీపీఎఫ్ Scheme : అత్యంత ప్రాచుర్యం పొందిన స్కీమ్

Post Office Scheme : భారత పోస్టాఫీసు అనేక పొదుపు పథకాలతో దూసుకుపోతోంది. పోస్టాఫీసు అందించే పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అత్యంత ప్రాచుర్యం పొందింది. దీన్ని ఎక్కువగా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎంచుకుంటారు. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా, ఈ స్కీమ్‌లో లభించే వడ్డీతో పాటు మెచ్యూరిటీ మొత్తమంతా టాక్స్ ఫ్రీగా ఉంటుంది.

పెట్టుబడిదారులు కనీసం ₹500 నుండి గరిష్టంగా ₹1.5 లక్షల వరకు సంవత్సరానికి డిపాజిట్ చేయవచ్చు. దీర్ఘకాల సేవింగ్స్ కోసం ఇది సురక్షితమైన ఎంపికగా ఉంటుంది.

24
రూ. 12,500 పెట్టుబడితో రూ. 40 లక్షల రాబడి ఎలా వస్తుంది?

ఈ పోస్టాఫీసు మని మేకింగ్ స్కీమ్ ద్వారా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ రాబడి పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి నెలకు ₹12,500 పెట్టుబడి చొప్పున పెడితే, 15 ఏళ్లలో మొత్తం ₹22.5 లక్షలు డిపాజిట్ చేసినవారవుతారు.

ఇందుకు 7.1 శాతం వడ్డీతో అదనంగా ₹17.47 లక్షలు వస్తాయి. ఇలా కలిపితే ₹40 లక్షలకు పైగా రాబడి లభిస్తుంది. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది.

34
పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ లో రుణ సౌకర్యం

ఈ దీర్ఘకాలిక స్కీమ్ పెట్టుబడిదారులకు రాబడితో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఖాతా తెరిచి ఒక సంవత్సరం పూర్తయ్యాక రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఖాతా 5 సంవత్సరాలు పూర్తయ్యాక కూడా డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సాయం పొందవచ్చు.

44
ఎందుకు పోస్టాఫీసు పీపీఎఫ్ స్కీమ్ ఎంచుకోవాలి?

పోస్టాఫీసు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవడం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో

  1. సేఫ్టీ: ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పథకం కావడంతో పెట్టుబడి భద్రత ఉంటుంది.
  2. టాక్స్ సేవింగ్స్: ఇందులో పెట్టిన డబ్బుపై, వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.
  3. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్: దీర్ఘకాలం పాటు పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రాబడి వస్తుంది.

దీని వలన కోట్లాది మంది భారతీయులు ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.

నిపుణుల సలహా అవసరం: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి చేయడానికి ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉండటంతో, సరైన ఎంపికలు, నిర్ణయాలు తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories