రూ. 5 లక్షలు 15 లక్షలు అవ్వాలంటే, ముందుగా 5,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో 5 ఏళ్ళకు ఇన్వెస్ట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ 5 ఏళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్కు 7.5 శాతం వడ్డీ ఇస్తుంది. ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం చూస్తే, 5 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ రూ.7,24,974 అవుతుంది. ఈ డబ్బును తీయకుండా మళ్ళీ 5 ఏళ్ళకు ఫిక్స్ చేయండి. ఇలా చేస్తే 10 ఏళ్ళలో 5 లక్షలకు వడ్డీ ద్వారా రూ.5,51,175 వస్తుంది. అప్పుడు మీ మొత్తం రూ.10,51,175 అవుతుంది. ఇది రెండు రెట్లకు పైగా.