Indian Railways: రైళ్లలో ఫుడ్ మెనూ కావాలంటే ఇకపై ఎస్ఎంఎస్ చేస్తే చాలు

Published : Mar 15, 2025, 10:07 AM IST

Indian Railways: రైళ్లలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనం డెలివరీ చేస్తారు కదా.. వాటి ధరలు ఎంతుటాయోనని ఇకపై మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మెనూ, వాటి ధరల లింక్‌లతో ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
Indian Railways: రైళ్లలో ఫుడ్ మెనూ కావాలంటే ఇకపై ఎస్ఎంఎస్ చేస్తే చాలు

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో నాలుగో స్థానంలో ఉంది. రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. మన దేశంలో సాధారణ ప్యాసింజర్ రైళ్ల నుంచి వందే భారత్ లాంటి లగ్జరీ రైళ్ల వరకు అన్ని రకాల రైళ్లు నడుస్తున్నాయి. వేల కి.మీ. ప్రయాణించే రైళ్లు, రోజుల తరబడి నడిచే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అందుకే చాలా రైళ్లలో టిఫెన్స్, భోజనం, స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రైళ్లలో ప్రయాణికులకు తక్కువ ధరకే భోజనం పెడతారు.
 

24

ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో భోజనం కచ్చితంగా ఉంటుంది. అయితే చాలా మంది ప్రయాణికులకు వారు ప్రయాణించే రైళ్లలో భోజనం ధరలు, మెనూ గురించి తెలీదు. అందుకే SMS ద్వారా మెనూ, ధరల వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్ సభలో చెప్పారు.

ఇది కూడా చదవండి 9 రాష్ట్రాలు.. 4,189 కి.మీ.. 74 గంటల ప్రయాణం.. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ ఇదే

 

34

IRCTC వెబ్‌సైట్‌లో మెనూ, ధరలు ఉంటాయి. సిబ్బంది దగ్గర మెనూ కార్డులు కూడా ఉంటాయి. కావాలంటే ప్రయాణికులు వాటిని అడగవచ్చు అని మంత్రి లోక్‌సభలో చెప్పారు.

మెనూ కార్డు, ధరల గురించి, పరిశుభ్రత గురించి కూడా మంత్రి వైష్ణవ్ మాట్లాడారు. వంటశాలల్లో CCTV కెమెరాలు పెట్టామని, మంచి నాణ్యమైన పదార్థాలు వాడుతున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి మీకు ట్రైన్ టికెట్ బుక్ చేయడం తెలియదా? ఈ విషయాలు తెలిస్తే ఇంత ఈజీనా అంటారు

44

ప్రయాణికుల కోసం తయారు చేసే ఆహార పదార్థాల్లో వంట నూనె, బియ్యం, పప్పులు, మసాలాలు, పాల ఉత్పత్తులు అన్నీ మంచి బ్రాండ్ వాడుతున్నామని మంత్రి చెప్పారు. IRCTC సిబ్బంది రైళ్లలో ఉంటారని, ఫుడ్ ప్యాకెట్లపై QR కోడ్‌లు కూడా పెట్టామని దాని ద్వారా ఆ ఫుడ్ కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 

ప్యాంట్రీ కార్లలో ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో తనిఖీ చేస్తామని, కస్టమర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. FSSAI సర్టిఫికేషన్ కూడా తప్పనిసరి చేశామని అశ్విని వైష్ణవ్ అన్నారు.

click me!

Recommended Stories