కానీ రానున్న రోజుల్లో పెట్రోల్ - డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా..? లీటర్ పెట్రోల్ ధర రూ.200కు పెరుగుతాయా..? అనే ప్రశ్నకు అవుననే అంటున్నారు ఇంధన నిపుణులు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశానికి తాకుతుండటంతో ఆందోళన చెందిన సామాన్యులకు దీపావళి (Diwali) సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఇంధన ధరల భారాన్ని కాస్త దింపింది.