బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 20 సెంట్లు లేదా 0.2 శాతం పడిపోయి బ్యారెల్కు 83.52 డాలర్లకి చేరుకుంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 37 సెంట్లు లేదా 0.4 శాతం పడిపోయి 83.20డాలర్లకి పడిపోయింది. గత ఏడాది కాలంలో బ్రెంట్ క్రూడ్ ధరలు 122% పెరిగాయి, ఇది భారతదేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117 దాటగా, డీజిల్ ధర రూ.108 దాటింది.అలాగే శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.122కు చేరుకోగ, డీజిల్ ధర దాదాపు రూ.113కు చేరుకుంది. హైదరాబాద్లో సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 40 పైసలు పెరిగి రూ.114.12కు చేరింది. డీజిల్ ధర కూడా లీటరుకు 42 పైసలు పెరిగి రూ.107.40కు ఎగసింది.