ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.84, ముంబైలో లీటరుకు రూ. 111.77 గరిష్ట స్థాయికి పెరిగింది. ముంబైలో డీజిల్ ఇప్పుడు లీటరుకు రూ. 102.52 కి చేరగా, ఢిల్లీలో ధర రూ.94.57గా ఉంది. అయితే అక్టోబర్ 12, 13 తేదీలలో ఇంధన ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో గత 23 రోజుల్లో 19 సార్లు డీజిల్ ధరపై మొత్తంగా రూ .5.95 పెరిగింది.