దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే లీటరుకు రూ.100దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్తో సహా చాలా రాష్ట్రాల్లో డీజిల్ ధరలు కూడా సెంచరీకి చేరువలో ఉన్నాయి. అయితే స్థానిక పన్నుల బట్టి ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.